Friday 9 July, 2010

దైవానికి ఒక బుద్ధి , ఒక న్యాయమూ , విచక్షణా ఉన్నాయేమో అన్న సందేహమన్నా రాదు.

సంస్కారమంటే ఈనాడు డబ్బు సంస్కారం తప్ప ఇంకోటి లేదు , తనకో ఆత్మ ఉందని మరిచి పోయినాడు మానవుడు. struggle for existance. ప్రకృతిలో- చెట్లలో- కీటకాలలో ఎట్లా ఉంది అంటారో అదే మనుషుల్లో ఈనాడు. వాటికి శాంతి ఉంది అది లేదు మానవుడికి.
ధనాలు అధికారాలు సంపాదించిన వారు కొద్దిమందే. కాని ప్రతి వాడికి దాని మీదే మోజు అదే ప్రయత్నం. అందరికి సుఖాలే ముఖ్యం. మానవుడి మీద ప్రేమా , మానవోద్దరణ అంటే , ప్రతి వాడికి కారు, టెలివిజన్ సప్లై చేయటమని అర్థం.. ధనం తో దురవస్థలో పడే వారు కొద్ది మంది. అది లేదే దాన్ని ఎట్లా సంపాదిద్దామా అని పగ పొందే వారు వేలకువేలు. ధనం వుండనీ, వుండకపోనీ, ప్రతి వారి ద్రుష్టి దాని మీదే .. ప్రతి వారి ఆశా , ఆశయము ధనమే.
సుఖమంటే, డాబు ఇతరులు తనని ఆశ్రఇంచడము తను అజ్ఞాపించడమూ,మిత్రులూ, కబుర్లూ,కోతలూ ఇవే చూసుకుంటాడు పైకి. కాని ఈ గొప్పల వెంట, చచ్చేపని , జాగ్రత్త, కుట్ర, ఇతరులని కూల్చడాలు , అబద్దాలు అన్ని ఇష్ట పడతాడు అందువల్లనే ఇంత అశాంతి పెరగడం. ఎందుకైనా మంచిదని తనకి సహాయం చేయటం కోసం పూజలు చేయిస్తాడు. పడిపోయేట్టు ఉన్న దేవుడిని తలచుకొంటాడు. తిరపతికి పోతూ ఉంటాడు. దైవాన్ని తన వైపు చేర్చు కుంటాడు దైవానికి ఒక బుద్ధి , ఒక న్యాయమూ , విచక్షణా ఉన్నాయేమో అన్న సందేహమన్నా రాదు.
ఇంకా మొక్కులతో సాధిస్తాడు , దురదృష్టం వచ్చేటట్టు కనపడిందా! " నన్ను నిలబెదితివా నేను వంద రూపాయలిస్తాను, తిరపతి వెంకటేశ్వరా! నాకు లక్ష ఇవ్వు .. నీకు వెయ్యి ఇస్తాను. నీకు నగ చేయిస్తాను. నీ గుడి చుట్టు పొల్లిగింతలు పెడతాను " అంటాడు.
ఈ బెరాలకి ఈశ్వరుడు ఒప్పుకుంటాడనే భ్రమ. భక్తి అనేది ఏ koshaanaa లేదు..ఉట్టి బేరాలు. ఈశ్వరుణ్ణి కూడా టోపీ వేద్దామనే, ఈమ ఘోరాలు చేస్తేనేం , ఆ దేవుడి మొహాన డబ్బో , జుత్తో , సంతర్పనో సహస్రనామార్చానో కొడితే సరి! 

No comments: