Friday 1 July, 2011

దేవుడి ప్రశ్నే లేదు.

 
" అసలు దేవుడున్నడనటమే మూర్ఖం "
ఎందుకు ?
" ఉన్నాడని ఎట్లా తెలుసు ? "
లేడని ఎట్లా తెలుసు ?
లేనిదాన్ని తెలుసుకోవ
మేట్లా ?
ఉన్నదాన్ని తెలుసుకున్నవా ?
దేన్నీ ?
నిన్ను ..!
తేలికేం.
తెలుసుకుంటే ఇంక దేవుడి ప్రశ్నే లేదు. -  chalam

Thursday 12 May, 2011

ఒక్కటే సాధనం

ఒక్కటే సాధనం.. సాహసం.
 " జీవితం లో విశ్వాసం. మూడత్వం మీద ...కర్మ మీద..శాసనం మీద తిరుగుబాటు..
భవిష్యత్తు మీద నిర్భయం.. ఆత్మలో దైర్యం...పర్యవసానాల మీద నిర్లక్షం ""  

- చలం.

Thursday 31 March, 2011

ఏ ఆశలేదు

ఈ ప్రపంచంతో సమన్వయం నాకు కుదరలేదు. ఇప్పాటికీ కుదరలేదు..ఎప్పటికీ కుదరదేమో మరి. ఈశ్వరుడు ప్రత్యక్షమై సత్య దర్శనం  అయితే అప్పుడిదంతా అర్ధమవుతుందంటారు. కాని నాకు అట్టాటిది ఏ  ఆశలేదు.  - చలం

Wednesday 9 March, 2011

అది చలం

చలంగారి రచనలు సమాజం..స్త్రీ, మనిషి.. జీవితం, స్వేచ్ఛ వీటన్నింటి మీద .. ఒక దృక్పథం కలిగిస్తాయి.. అవొక ఆలోచన ..ఒక మేలుకొలుపు .. ఒక తత్వం ..
ప్రకృతిలో మమేకమై ..ప్రేమించి ..ఆరాధించి.. ఆ అమృతాన్ని తన అక్షరాల్లో నింపిన మహానుభావుడు చలం.తనలోకి తాను చూసుకొన్న ఒక తపస్వి ఆయన.
ఇదుగో, ఇది సమాజం..ఇది నీవు..ఇది స్త్రీ..ఇది మనం కొలిచే దేవుడు..ఇది..ప్రకృతి..ఇది ఆనందం...అంటూ చెయ్యిపట్టుకొని చూపిస్తాడు చలం.
ఒక స్త్రీకి తన గురించి తనకే తెలీదు.తను ఎందుకలా ప్రవర్తిస్తుందో, ఎం కోరుకుంటుందో, ఎం కోల్పోతుందో... వీటిని గూర్చి రాసాడు చలం.

చాలా మందికి చలం కథల్లో ఎంత సేపూ అక్రమ సంభంధాలు..కామం..కనపడి అవొక బూతు కథలుగా కనపడతాయి. కాని
* "సౌఖ్య మివ్వడానికి ధనము ఆస్తి ముఖ్యమనుకున్నంత కాలం ఇంకా ఏ విలువకీ స్ట్లముండదు మనుషుల మనస్సులో , తనను సృష్టించిన మన్ను తోటి, తన కళ్ళు తెరిచిన కాంతి తోనూ సంభందానికి దూరమవుతున్నాడు మనిషి.

" ఈ నాడు ఈ దేశం లో ఎలాగైనా ధనం సంపాదించే మార్గమే ధర్మ మార్గమైంది.
డబ్బు పేరు సంపాదించిన స్త్రీలు తమ సంసారమెట్ల ఉన్నాసరే సంఘంలో యోగ్యులైనారు.

తెల్లారి లేస్తే ఉరుకులు, పరుగులు, ఉద్యోగాలు డబ్బులు , ఇవ్వన్నీ వదిలి సూర్యోదయాన్ని చూసి నవ్వే మనో వ్యవధి, పువ్వులనుంచి, ఆవులనించి, అతితులనించి, ఇతలురాల్ ఆకలి తీర్చడం నుంచి వచ్చే సంతోషం ఉత్సాహం, శాంతి ఎప్పుడు కలుగుతుందో ఈ మానవులకి."
" ధనాలు అధికారాలు సంపాదించిన వారు కొద్దిమందే. కాని ప్రతి వాడికి దాని మీదే మోజు అదే ప్రయత్నం. అందరికి సుఖాలే ముఖ్యం. మానవుడి మీద ప్రేమా , మానవోద్దరణ అంటే , ప్రతి వాడికి కారు, టెలివిజన్ సప్లై చేయటమని అర్థం.. ధనం తో దురవస్థలో పడే వారు కొద్ది మంది. అది లేదే దాన్ని ఎట్లా సంపాదిద్దామా అని పగ పొందే వారు వేలకువేలు. ధనం వుండనీ, వుండకపోనీ, ప్రతి వారి ద్రుష్టి దాని మీదే .. ప్రతి వారి ఆశా , ఆశయము ధనమే. "
బూతు కథలు రాసే వ్యక్తే నా ఇలా రాయకలిగేది?? 

ఒక మనిషి దేని గురించైనా  చెప్పాలంటే.. అందులో మమేకం కావాలి..
"ఎటు చూసినా నీలపు ఆకాశం, కొండలు, పచ్చని చెట్లు,, ఆకాశం కేసి చేతులు చాచే మైదానాలు.."
"ఆరు బయట చక్కని బంగారపు ఎండలో తళతళ లాడే ఏటి చల్లని నీళ్ళు.. తెల్లని ఇసిక... చిన్ని అలలు నా కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడటం, తమాషా రంగుల పిట్టలు వచ్చి తొంగి చూసి , చిన్ని చిన్ని పలుకులు ఈలలు ,, ఆ ఆకుల గుహల్లోంచి పలికేవి.ఆ పక్షి రెక్కలోంచి ఒక ఈకే నామెడ వచ్చి వాలేది సోమరిగా, "
"ఆ పిట్టలన్ని నాకు గుర్తు, ప్రతి మధ్యాన్నం ఎదురు చూసేదాన్ని వాటికోసం, వాటికీ నాకు ఏదో భందుత్వం ఉన్నట్టు తోచేది. కొంగల బారు నా తల మేడనుండి వెడుతూ నా ఒంటరి తన్నాన్ని గుర్తు చేసింది..."

ఇలా రాసుకుంటూ పొతే లెక్కలేనన్ని...ఇవన్ని ఏదో గాలి వాటానికి వచ్చే కవిత్వం కాదు..అల్సలిది కవిత్వమే కాదు... ఆ సునిశిత ద్రుష్టి ఎలా కలుగుతుందంటే .. ప్రకృతిలో జీవించి.. అనుభవించి..ఆస్వాదించి ..అనుభూతి చెందటం వల్ల. దానిలో మమేకం కావటం వల్ల. తన ఆనందాన్ని అనుభవాన్ని అంతా  రాతల్లోకి దోల్లించాడు.

* ప్రకృతిని ప్రేమించి ప్రకృతిలో జీవించి ...ఒక మహర్షి లాగా బ్రతికాడు.... అది చలం.
చలంగారూ నాస్తిక రచయితకాదండీ. పురాణల్లో, పుస్తకాల్లో ఉన్న దేవుళ్లని, ఆ పాతివ్రత్యాన్ని అందులో ఉన్న చెత్తా చెదారాన్ని దుయ్యబట్టాడు. కానీ ఎప్పుడూ ఈశ్వరుడు ఉంటే.. అనే ధ్యాసలో గడిపాడు. వీళ్లు రాసిన దాంటో ఆయనకి సమన్వయం కుదరలెదు తప్ప నాస్తికుడు కాదు. ఆ ఈశ్వరాన్వేషణలో బతికాడు.
* రమణ మహర్శి వేరు.. వివేకానంద వేరు. రమణమహర్షిని ఒప్పుకుంటే వివేకానందుడిని ఒప్పుకున్నట్టు కాదు. చలం ఏ రాతలు రాసినా మనసులో ఓ మూల సత్యాన్వేషణ .. ఈశ్వరాన్వేషణ కలిగిఉన్నాడు. అందుకే ఆ అన్వేషణలో భాగంగానే రమణమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకి కలిగిన అనుభవాలు..అనుభూతులు చెప్పాడు. ఆ ఒక్క విషయాన్ని తీసుకొని చలం ఏదో "మన " దారిలోకొచ్చాడు అని ఫీల్ అయితే లాభం లేదు. ఊరికే ఈశ్వరుడున్నాడు అని ఒప్పుకొని..లోకంలో పడి తమ పనుల్లో ..పాపకార్యాల్లో పడి బతికే వాళ్ళు వేరు. ఉన్నాడా అనె సంశయంతో ఆ అన్వేషణలో బతికి విషయాన్ని కొంతవరకు రియలైజ్ కావటమ్ వేరు. 

Friday 18 February, 2011

ప్రపంచం సౌందర్యమయం



ఏ మాత్రం కళ్ళు కల వాడికైనా ఈ ప్రపంచం సౌందర్యమయం గా కనపడక మానదు.
ఒక్కొక్క జ్ఞానేన్ద్రియాన్ని మేల్కొలిపి..రంగులతో, స్వరాలతో రుచులతో, పరిమలాలతో ముదు స్పర్శలతో, అభిరుచులతో,కళలతో, ప్రేమతో,సంతోషంతో, భావోద్రేకాలతో.. రక రకాల ఆనంద పెట్టాలని చూస్తుంది. తనని తన సౌందర్యాన్ని చూసి అనుభవించి సుఖించమని, బ్రతిమిలాడి పిలుస్తున్నట్టు నిద్ర నిచి, మత్తు నుంచి లేపి ఎదురవుతుంది. ఆకలేస్తే భోజనం అడుగుతాము, దాంటో రుచిని కలిపింది. కామం తీర్చుకోవాలని బుద్ది పుడితే దాంటో ప్రేమనీ, అందాన్ని చేర్చింది.
తోవ కనపడితే చాలు అనుకుంటే పక్కనే చెట్లని పువ్వుల్నీ పెట్టింది.గొంతుకలో మర్ధవాలు, రుచులలో పరిమళాలు, ఆకాశంలో లో నునుపు, గాలిలో మృదుత్వం, వెన్నెలలోని నిర్మలత్వం నీళ్ళలోని చల్లదనం అన్నీ. నత్త గుళ్ళలో, గడ్డి పువ్వుల్లో, కీటకాల నడకల్లో, పక్షి రెక్కల వొంపుల్లో సౌందర్యాన్ని ఊరికే గుమ్మరిస్తుంది. 

పుట్టినప్పటినుండి ప్రతి జీవిని, ఏ లోకం తన వొళ్లోకి తీసుకొని సుఖపెట్టాలని చూస్తుంది. పిల్లలకి సదుపాయం చేయటం కోసమై తల్లి హృదయంలో ప్రేమ, స్థనంలో పాలు, అ పాలలో మాధుర్యము, తోడల్లో మెత్తదనము, పొట్టలో ఆకలి, నోటిలో రుచి ఇవన్నీ ఏర్పరుస్తుంది సృష్టి 

Tuesday 15 February, 2011

త్యాగం


శ్రీరాముడు అడవికి పోతే దానిని ధర్మం అన్నారు, త్యాగం అనలేదు..అలాగే సీతా తానేమి త్యాగం చేసిందనుకోలేదు, కష్టం వోష్టే ఏడ్చారు.. సుఖం వొస్తే నవ్వారు.అంతే తప్ప తామేదో గొప్ప త్యాగం చేసాం అని చెప్పలేదు. బుద్దుడు ఇల్లొదిలి పోతే అతను గాని..ఇంకెవరు గాని దాన్ని త్యాగం అనలేదు.. ఈ నాడు మనం ఓహో ఎంత త్యాగం! అంటాం.
మనకి కనపడే ఈ మానవ జీవితం లోంచి కొన్ని సూత్రాల్ని అర్థాల్ని లాగటానికి చేసే ప్రయత్నం వల్ల వొచ్చింది ఈ ఘోరం. మన పూర్వులు సూత్రాల్ని లాగారు.కాని వాటిని జీవితానుషణం లోకి తీసుకు రావటానికి  గట్టి ప్రయత్నాలు చెయ్యలేదు.
సైన్సు అంటే కనపడే దంతోంచి సూత్రాల్ని లాగటం. పశ్చిమ దేశాల్లో సైన్సు సైన్సు లా ఉండకుండా మనషుల మనసుల్ని ..నమ్మకాల్ని  మతాన్ని రాజ్యాంగ విధానాన్ని పరిపాలించాతానికి పూనుకుంది.  థాట్ ని సంగం మీదకు తెచ్చి ఉన్న వ్యవస్థని మార్చటానికి కుల త్రోయ్యతానికి ప్రయత్నించినప్పుడే తగాదా.
త్యాగామనేది త్యాగమని తెలియకుండా జరగాలి.

Monday 14 February, 2011

కొత్త తరగతి స్త్రీలు.




 
అసలు సంసార సుఖం చాలక  నరాలు ఎండి    అర్థం కాని బాధ బయలు దేరి తెంపెర్ పాడయ్యి చుట్టుపక్కల వారిని హింస పెడుతూ జెలసీ తో నీతి ఖండనలతో క్షోభ పడుతున్నారు చాల మంది నవీన స్త్రీలు.
ముఖ్యంగా ఇపుడు స్కూళ్ళల్లో/ కాలేజీల్లో/ ఉద్యోగాల్లో  ఉన్న   ఆడవాళ్ళు మరీ అన్యాయం. నేర్చుకునే/ నేర్చుకున్న  చదువు కొత్తది.. మగా  వాళ్ళతో  కలుస్తారు. కాని నేర్చుకున్న నీతులు పాతవి. మొగవాళ్ళని  తాకనియ్యరు. ( రహస్యంగా కొందరు తాకనిస్తారు..కాని ఆ దొంగతనం ఆ భయం ఆరోగ్యాన్ని తినేస్తాయి.) సహజ వాంఛలతో నిండిన మనసు ఆ కామానికి దగ్గరిగా ఉన్నా మొగవాళ్ళ ఆరోపిస్తుంది. కలహాలు, తమ తాహతును, విద్యని మరిచి సామాన్య స్త్రీలవలె  భర్త హస్తాల్లో సహితం శాంతిని పొందలేరు. అసంతుష్టి.  చాలామంది ఇదివరకు స్త్రీ పురుషుదు ఎంతసేపు సెక్స్ గురించే ఆలోచిస్తాడనీ  తాము పురుషుడు లేకుండా లోబడకుండా బ్రతుకుదామనీ ప్రయత్నించి ఏనాడో ఇంద్రియాలు తిరగాబడగా ఏ  గుమాస్తకో..  జవానుకో దక్కుతారు  ఈ దుర్గతి లో పడ్డవాళ్ళు  ముఖ్యం ఆడ టీచర్లు.. డాక్టర్లు .నర్సులు.. వల్ల ఉద్యోగ రీత్యా పురుషులతో కలిసి తిరగటానికి వీలు ఉంది.స్కాన్డల్స్   లేకుండా వీరు ఇప్పుడు బయలు దేరుతున్న కొత్త తరగతి స్త్రీలు.

Friday 4 February, 2011

స్త్రీ




 స్త్రీలను గౌరవించమని ప్రతివాడు గోలపెడతాడు.. అగౌరవం అంటే కోరటం  అని అర్థం.గౌరవం పొందటం అతి సులభం..ఓ నలబై ఏళ్ళు గడిచి మీ సౌదర్యం మాసిపోగానే అత్యంత గౌరవం పొందుతారు. ప్రతివాడు గౌరవిస్తాడు..ఒక్కడూ కోరడు.